పాడేరు, డిసెంబర్17: ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన కమిటీ అధ్యక్షురాలిగా జె.అన్నపూర్ణ (హుకుంపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం పాడేరు జిల్లా కేంద్రం
గిరిజన భవన్లో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి ఆధ్వర్యంలో జిల్లా ఆర్ఎంపి సంఘం కమిటీ ఎన్నిక నిర్వహించారు.ఉపాధ్యక్షునిగా జి.ఎన్.మూర్తి(గుత్తలపూడి), ప్రధాన కార్యదర్శిగా పి. జానకిరామరాజు(అరకు), సహాయ కార్యదర్శిగా ఎన్.సత్యనారాయణ(ముంచింగ్ పుట్),కోశాధికారిగా అలిప్ భిశ్వాల్ (పెదబయలు), కార్యవర్గ సభ్యులుగా పెంటయ్య (అరకు వాలీ),ఎస్.శ్రీనివాసరావు(రోలకోట),బి.నరేష్(పాడేరు),
కె.బలరాం (మంచింగ్ పుత్) గౌరవ సలహాదారులుగా చిన్నంనాయుడు, కే.సన్యాసిరావు,డి.రాజులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా కలామ్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, అల్లాడ త్రినాథరావులు వ్యవహరించారు.నూతనంగా ఎన్నికైన కమిటీనీ జోనల్ నాయకులు నిమిషకవి రాజు,అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.ఈశ్వరరావు, విశాఖ జిల్లా కోశాధికారి క్రిష్ణ అభినందించారు.