ఫెడరేషన్ సమాఖ్య సంఘాలకు, నాయకులకు, నమస్కారం. ఫెడరేషన్ నాయకులుగా సంఘాల సభ్యుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పయనిస్తున్న ఏకైక సంఘం అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ఫెడరేషన్. ఒక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వివిధ రకాలుగా మన సమస్యలను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకు వెళుతూ…., మరో ప్రక్క జాతీయ నాయకులను మంత్రివర్యులను కలిసి, ఎన్ ఎం సి లో పొందుపరిచిన చిన్న అంశమును, భారత ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టాలని కోరుతూ…, మన సమస్యలను వారి దృష్టిలో పెట్టే ప్రయత్నం అందులో భాగంగా ఈరోజు ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అలాగనే నా మిత్రులు అబ్దుల్ కలాం ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్ మరియు ఉత్తరాంధ్ర వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతి రావు గారు మరియు తదితర మిత్రులతో స్థానిక బిజెపి ఎం ఎల్ సి మాధవ్ గారు ఆధ్వర్యంలో , విశాఖకు విచ్చేసిన జాతీయ పర్యాటక మంత్రివర్యులు గౌరవ శ్రీ జి కిషన్ రెడ్డి గారిని కలవడం అయినది. వారికి క్షుణ్ణంగా వివరించడం అయినది. ఎన్ ఎం సి విషయంలో తప్పకుండా కృషి చేస్తాను అని ఇటు బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ గారు మరియు మంత్రివర్యులు హామీ ఇచ్చారు. వారిరువురికి ఫెడరేషన్ తరుపున, మా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమం తరుపున. మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాము

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *