నరసరావుపేట ఈస్ట్: దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాదు, జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా శనివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్తో కలసి ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాం«ధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.