15/9/22. మధురవాడ సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. సిఐ రామకృష్ణ మధురవాడ పీఎం పాలెం సిఐ రామకృష్ణ తో పరస్పర సమాచార సమావేశ కార్యక్రమం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తో అనుసంధానంగా ఆర్ఎంపీల వైద్యులతో మిలిగే విధానాన్ని, చట్ట పరిధిలో తెలియచేస్తూ,.. ఒక కార్యక్రమమును స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ… ఒక పేషెంట్ ని చూస్తే కేసు వివరాలు, అందుకు సాక్షాలు, చాలా ముఖ్యమన్నారు. అలాగనే యాక్సిడెంట్, కొట్లాటలో జాగ్రత్త వహిస్తూ, యాక్సిడెంట్ సమయంలో కంగారు పడకుండా 100 నెంబర్ కి ఫోన్ చేసి వివరాల అందించాలని వీరిని కోరారు. సైబర్ నేరాలు పెరుగుతున్నందున, సమాజంలో మీరు ముఖ్య వ్యక్తులుగా ఉన్నందున, మీ బాధ్యత చాలా అవసరమని, మాతో అనుసంధానమై ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన మాట్లాడుతూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జంగం జోషి పాల్గొన్నారు.త్వరలో మండలాలలో ఇదేవిధంగా డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసే మంచి కార్యక్రమము, జరుపబోతున్నాము అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్ష కార్యదర్శులు ఈ రామకృష్ణ జగదీశ్వరరావు స్థానిక ఆరంభి నాయకులు కిరణ్ కుమార్ రమేష్ సూర్యనారాయణ, జనార్ధన రావు, రమేషు తదితరులు పాల్గొన్నారు